Jeevita Visheshala Samaharam

                                                            జీవిత  విశేషాల సమాహారం 


1914 - జననం

1945 - ' మణి  మాల '  ఆచార్యుల  వారి మొదటి  ప్రచురణ

1958 - 'ఆహ్వానము '  పుస్తక  ప్రచురణ

1966 - 'పోతన చరిత్ర ము ' మహాకావ్య ప్రచురణ

1968 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు

1971 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట  సభ్యత్వము

1972 - ఉపాధ్యాయ  వృత్తి  పదవి  విరమణ

1972 -  ఆంధ్రప్రదేశ్  శాసనమండలి ఎం ఎల్ సి  గ  నామినెట్  చేయబడడం  (పి  వి  నరసింహారావు  గారి  అ ధ్వర్యం లో )

1973 - గండపెండేరం , స్వర్ణ కంకణం , రత్నాభిషేకం  (భారతి సాహిత్య సమితి కోరుట్ల)

1976 - డి. లిట్  వాచస్పతి  (సంపూర్ణానంద సంస్కృత  విశ్వవిద్యాలయం , వారణాసి )

1978 -  ఎం ఎల్ సి  పదవి విరమణ

1978 - 'వైశాలిని '  నాటక  ప్రచురణ



2003 - అభినవ పోతన వానమామలై వరదా  చార్యులు - సాహిత్య సమాలోచనం , ఆచార్యుల     వారి   సతీమణి వైదేహి గారికి సత్కారం (యువ కళా వాహిని )

2010 - ఆచార్యుల 99 వ జయంత్యుత్సవం - 'మణి మాల '  పుస్తక  పునర్ముద్రణ, అభినవ  పోతన వానమామలై ' అవార్డు  ప్రదానం   (అభినవ పోతన లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్  మరియు భారత్  కల్చరల్  అకాడమీ )

2010 -  "మన వానమామలై " డాక్యుమెంటరీ చిత్రం (డి  సురేష్ కుమార్ గారి  అధ్వర్యం లో )

2011 -  వానమామలై వారి శతజయంతి ఉత్సవాల  ఆరంభం  (ఆగష్టు 31)
            "భోగినీ  లాస్య రూప ము"  నృత్య దర్శకులు శ్రీ భాగవతుల సేతురాం  గారి బృందం

2011 - ఆచార్యుల వారి కాంస్య  విగ్రహ ఆవిష్కరణ , చెన్నూరు  (డిసెంబర్ 4)

2012 - వానమామలై  వారి శతజయంతి ఉత్సవాల సమాపన 

2017 - వానమామలై వారి 105 వ జయంతి , ఆచార్య ఫణింద్ర వారి  'మణిమాల లో  మానవీయ 
                  దృక్పథం ' ప్రసంగం


సరస్వతీ  దేవి కటాక్షము  వానమామలై వారి సాహితీ  ఝరి కి  మూలము . వానమామలై వారు సాహిత్య ఆరంభం 13 వ  ఏట ప్రారంభించి  సుమారు 60 రచనలను  వివిధ  ప్రక్రియలలో  (పద్య, వచన, గేయ, నాటిక , నవల, అనువాద, వ్యాఖ్యానం, వ్యాసాలు , బుర్రకథ  మున్నగునవి )మనకు  అందించారు. వారికున్న నాట్య, వాయిద్య  ఇతర కళ లలో ని  పరిజ్ఞానం  వారి సాహిత్యం లో కనపడుతుంది.  ఆచార్యుల వారి రచనలు ప్రముఖ రచయతలు , సాహితి వేత్తలు , విమర్శకులను  (విశ్వనాథ  సత్యనారాయణ గారు , దివాకర్ల  వెంకటావధాని గారు, చెళ్ళపిళ్ళ వెంకట శతావధాని గారు,  దాశరథి గారు , నారాయణ రెడ్డి గారు , కాళోజి గారు , జి వి  సుబ్రమణ్యం మున్నగు వారు ) ఆనందింప చేసాయి .వానమామలై వారి సాహిత్యం  నిజాము నిరంకుశ  పాలనను  విమర్శించి  ప్రజలను మార్పు వైపు పయనించుటలో దోహదమైనవి . వారి సాహిత్యం  సమకాలీన పరిస్థితులను (గాంధీ స్వాతంత్య్ర  ఉద్యమం , చైనా , పాకిస్తాన్  దురాక్రమణలు , నిజాము పాలన , మత సంఘర్షణలు , మానవత , రైతు జీవితము ) ప్రతిబిం బించాయి


కవి చిరంజీవి.  కవి ఎల్లప్పుడు  పాఠకుని మదిలో  నిలిచి  ప్రకాశిస్తాడు. కవి అజరామరుడు . కవికి లేదు అంతం . కవి  మార్గదర్శి - "తమసో  మా  జ్యోతిర్ గమయ  ......  "

 





 

Popular posts from this blog